తెలంగాణ: నళినికి మళ్ళీ డిఎస్పీగా ఉద్యోగం
చిదంబరం ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ, మెదక్లో జరిగిన పలు తెలంగాణ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన వెలువడిన నేపథ్యంలో తిరిగి తన కు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఆమె డిసెంబర్ 18న హోంమంత్రి, డీజీపీలకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 23న తెలంగాణపై కేంద్రం చేసిన రెండో ప్రకటన నేపథ్యంలో సర్వత్రా ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఆమె ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు కేంద్ర హోంమంత్రి చిదంబరానికి 19 పేజీల లేఖ రాశారు.
తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అందులో ప్రస్తావించారు. అయితే నళినీకి పోస్టింగ్ విషయమై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్ని రోజులుగా పోస్టింగ్కు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరే పెండింగ్లో ఉంది. సోమవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నళినీకి తిరిగి పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడటంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.