హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ కోతపై అసెంబ్లీలో దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ కోతపై మంగళవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన అయిదు నిమిషాలకే వాయిదా పడింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అయితే చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టారు. ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

సభను వాయిదా వేసి అన్ని పార్టీల శాసనసభా పక్షాల నేతలతో స్పీకర్ చర్చలు జరిపారు. విద్యుత్ కోతపై రేపు చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఈ సమావేశంలో అంగీకరించింది. విద్యుత్ కోతపై చర్చకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ తర్వాత సభ నడిచింది. విద్యుత్ కోతకు నిరసనగా ప్రజారాజ్యం పార్టీ శానసభ్యులు మంగళవారం ఉదయం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. లాంతర్లతో వారు శాసనసభకు వచ్చారు. తెలుగుదేశం, వామపక్షాలు లాంతర్లతో గన్ పార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X