వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా బిల్లుపై పార్లమెంటులో అదే దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దుమారం చెలరేగింది. లోకసభలో మహిళా బిల్లుపై దుమారం చెలరేగడంతో స్పీకర్ మీరా కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. మహిళా బిల్లుపై తీవ్ర గందరగోళం చెలరేగడంతో చైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆర్జెడీ, ఎస్పీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

మహిళా బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్న శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. ఏకాభిప్రాయం సాధించేందుకు ఆయన ప్రయత్నించారు. మహిళా బిల్లుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాగా, బిజెపి కార్యకర్తలు బిల్లును ఆమోదించాలంటూ పార్లమెంటు భవనం వద్ద ధర్నాకు దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X