వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ నుంచి 7గురు ఎంపీల సస్పెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Hamid Ansari
న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై ఆందోళన చేస్తున్న ఏడుగురు రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆరుగురు సమాజ్ వాదీ, ఆర్జెడీ సభ్యులతో పాటు ఏ పార్టీకీ చెందని ఒక సభ్యుడిని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ అమలవుతుంది.

సుభాష్ యాదవ్, సబీర్ అలీ, వీర్పాల్ సింగ్ యాదవ్, నంద్ కిషోర్ యాదవ్, అమీర్ ఆలం ఖాన్, కమల్ అక్తర్, ఎజాజ్ అలీ రాజ్యసభ నుంచి సస్పెండయ్యారు. వారి సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తీర్మానం ప్రతిపాదించగా సభ మూజువాణీ వోటుతో ఆమోదం తెలిపింది.

మహిళా బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళం చెలరేగుతుండడంతో పదే పదే సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. రాజ్యసభను చైర్మన్ హమీద్ అన్సారీ రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X