వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనక్కి తగ్గిన లాలూ, ములాయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Lalu Prasad Yadav
న్యూఢిల్లీ: కాంగ్రెసు నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంలో సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ వెనక్కి తగ్గారు. మహిళా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వీరిద్దరు యుపిఎ ప్రభుత్వంపై లోకసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు కొంత కసరత్తు చేశారు. అయితే తమకు తగిన సంఖ్యాబలం లేదనే కారణంతో ప్రస్తుతం వారు వెనక్కి తగ్గారు.

ఇప్పుడే ఏమీ లేదని, ఆ విషయంపై తాము ముందు చర్చించుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని, తమకు తగిన సంఖ్యాబలం లేదని ములాయం సింగ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీకి లోకసభలో 21 మంది సభ్యులున్నారు. యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలో కూడా ముందుకు సాగే పరిస్థితిలో ఉన్నట్లు వారు కనిపించడం లేదు. తాము రాష్ట్రపతిని కలుసుకోవడం లేదని ఆయన అన్నారు.

తాము అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించడానికి ఆలోచన చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తమకు నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారని, అందువల్ల అది సాధ్యం కాదని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. తాము రాష్ట్రపతిని సమయం అడిగామని, అయితే ఇంత వరకు తమకు సమాచారం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X