వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి సమన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సమన్లు జారీ చేసింది. మార్చి 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. మోడీని విచారించేందుకు సిట్ ఆ సమన్లు జారీ చేసింది.

మృతి చెందిన కాంగ్రెసు ఎంపి ఎషాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్ మేరకు సిట్ ఈ సమన్లు జారీ చేసింది. అహ్మదాబాద్ లో గుల్పర్గ్ సొసైటీ ఊచకోతలో ఎషాన్ జాఫ్రీ మరణించారు. ఈ కేసులో సిట్ మోడీపై తగిన సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X