న్యాయవిచారణ జరిపించాలి: గద్దర్
ఇద్దరు మావోయిస్టు నేతలను పోలీసులు పట్టుకున్న విషయం కేంద్ర హోం మంత్రి పి. చిదంరానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు తెలుసునని, బూటకం ఎన్ కౌంటర్లకు వారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. శాసనసభా సమావేశం జరుగుతుండగా ఆ నేతలను పట్టుకున్న విషయం ముఖ్యమంత్రికి తెలిసిందని, చిదంబరం కబురును పోలీసు ఉన్నతాధికారి ఒకరు ముఖ్యమంత్రికి చేరవేశారని ఆయన అన్నారు. ఈ బూటకం ఎన్ కౌంటర్లకు రోశయ్య ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుందని ఆయన అన్నారు. రెండు రోజుల నుంచి చిదంబరానికి, రోశయ్యకు మధ్య మావోయిస్టు నేతలను పట్టుకున్న విషయంపై మాటలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
Comments
గద్దర్ మావోయిస్టులు ప్రకాశం హైదరాబాద్ శాఖమూరి అప్పారావు నల్లమల ఎదురుకాల్పులు gaddar maoists prakasham hyderabad sakhamuri apparao nallamala
Story first published: Friday, March 12, 2010, 14:42 [IST]