హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యాయవిచారణ జరిపించాలి: గద్దర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: రెండు జిల్లాల్లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్లపై హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ డిమాండ్ చేశారు. మావోయిస్టు నేతలు శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండల రెడ్డిని బూటకం ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ఆ ఇద్దరు నేతల మృతదేహాలను హైదరాబాదుకు తరలించి నిపుణులతో పోస్టు మార్టం జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరు నేతల శవయాత్రలకు ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదని, శవయాత్రలకు పోలీసులు ఆటంకం కలిగించకూడదని ఆయన అన్నారు.

ఇద్దరు మావోయిస్టు నేతలను పోలీసులు పట్టుకున్న విషయం కేంద్ర హోం మంత్రి పి. చిదంరానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు తెలుసునని, బూటకం ఎన్ కౌంటర్లకు వారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. శాసనసభా సమావేశం జరుగుతుండగా ఆ నేతలను పట్టుకున్న విషయం ముఖ్యమంత్రికి తెలిసిందని, చిదంబరం కబురును పోలీసు ఉన్నతాధికారి ఒకరు ముఖ్యమంత్రికి చేరవేశారని ఆయన అన్నారు. ఈ బూటకం ఎన్ కౌంటర్లకు రోశయ్య ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుందని ఆయన అన్నారు. రెండు రోజుల నుంచి చిదంబరానికి, రోశయ్యకు మధ్య మావోయిస్టు నేతలను పట్టుకున్న విషయంపై మాటలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X