హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ కౌంటర్లపై విచారణ జరపాలి: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: రెండు జిల్లాల్లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్లపై విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. మావోయిస్టు నేతలు శాఖమూరి అప్పారావు, కొండలరెడ్డిలది బూటకపు ఎన్ కౌంటర్లేనని ఆయన అన్నారు. మళ్లీ రాష్ట్రంలో బూటకం ఎన్ కౌంటర్లు ప్రారంభమయ్యాయని, ఇది దురదృష్టకరమని ఆయన శుక్రవారం అన్నారు.

కాగా, తమ బంధువు అయిన సోలిపేట కొండలరెడ్డిని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసి తాను ముఖ్యమంత్రి రోశయ్యను, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశానని, కొండల రెడ్డిని కోర్టులో హాజరు పరచాలని కోరారని తెరాస నాయకుడు సోలిపేట రామలింగా రెడ్డి అన్నారు. తన కోరికను మన్నించకుండా బూటకపు ఎన్ కౌంటర్లో కాల్చి చంపారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రోశయ్య, సబితా ఇంద్రారెడ్డిలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X