వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఆత్మాహుతి దాడిలో పది మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Suicide attack in northwest
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆత్మాహుతి దాడులతో అట్టుడుకుతూనే ఉన్నది. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో ఆత్మాహిత దళ సభ్యుడు పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో గల సెక్యూరిటీ చెక్ పోస్టులోకి చొచ్చుకుపోయి పేల్చేసుకున్నాడు. దీంతో పది మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. శుక్రవారం లాహోర్ లో జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించారు.

స్వాత్ లోని మింగోరాలో ఆత్మాహతి దళ సభ్యుడు చెక్ పోస్టుపై దాడి చేశాడు. ఈ చెక్ పోస్టులో పోలీసులు, సైనికులు ఉంటున్నారు. మృతి చెందిన పది మందిలో ఇద్దరు భద్రతాధికారులుంటున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. ఆ దాడితో ఆ ప్రాంతంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. దుకాణాలను, హోటళ్లను మూసేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X