వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిత్యానంద ఎక్కడన్నది సస్పెన్స్
కుంభమేళా పూర్తయిన తరువాత ఒక వారంలోగా వచ్చేస్తానని ఈటీవీ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యానంద తెలిపారు. ఈ ముఖాముఖి శనివారం రాత్రి ప్రసారమైంది. ఆశ్రమంలో భక్తులు ఇచ్చిన విరాళాలకు అన్ని రికార్డులు ఉన్నాయని, భూవివాదాలు ఏమీ లేవని స్పష్టీకరించారు. ముగ్గురు భక్తులు ఆశ్రమానికి ఇచ్చిన దానంలో చట్టబద్ధత ఉందని వివరించారు. ఈ ఆరోపణలొక గుణపాఠమని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఈటీవీ కన్నడ ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
Comments
Story first published: Sunday, March 14, 2010, 16:20 [IST]