వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలు జిల్లాలో కర్నాకటవాసులు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool
కర్నూలు: కర్నూలు జిల్లాలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కర్నాటకలోని రాయచూర్ కు చెందినవారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని పెద్దపాడు వంతెన మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ట్రాక్స్ మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ట్రాక్స్, లారీ నుజ్జు నుజ్జయ్యాయి.

కర్నాటకకు చెందినవారు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని 108 వాహనంలో కర్నూలులోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాధితులు అపస్మారక స్థితిలో ఉన్నారు. నాగలాపురం పోలీసులు, కర్నూలు సిఐ జనార్దన్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X