వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద కేసు కర్ణాటక సిఐడికి

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూరు: ప్రైవేటు టీవీ చానళ్లలో తన రాసలీలలు ప్రసారమైన తరువాత ఒక్కసారిగా కనుమరుగైన ధ్యానపీఠం వ్యవస్థాపకుడు నిత్యానంద పరమహంస కేసు దర్యాప్తును సీఐడీ పోలీసులకు అప్పగించనున్నట్లు కర్ణాటక ఐజీ ఇన్‌ఫ్యాంట్‌ తెలిపారు. మంగళవారమిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ధ్యానపీఠం ముఖ్య కార్యాలయం బెంగళూరుకు దగ్గర్లోని బిడదిలో ఉండటంతో కేసు దర్యాప్తును కర్ణాటక పోలీసులకు అప్పగించేందుకు తమిళనాడు పోలీసులు ముందుకు వచ్చారని చెప్పారు. కేసు ఫైల్‌ ఇప్పటికే తమకు చేరిందన్నారు.

మరోవైపు...హరిద్వార్‌లో సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించిన తరువాత నిత్యానంద మళ్లీ కనిపించకుండా పోయారు. ఏప్రిల్‌ రెండవ తేదీలోగా తమిళనాడు హైకోర్టు ముందు నిత్యానంద హాజరయ్యే అవకాశం ఉందని ఆశ్రమవర్గాలు తెలిపాయి. అప్పటికి కుంభమేళా ఉత్సవాలు పూర్తవనున్నాయి.

నటి రంజితతో నిత్యానంద సాగించిన శృంగార లీలల చిత్రాల సీడీలు, డీవీడీలు రూ.100 నుంచి రూ.500 ధరల మధ్య వరకు అమ్ముడవుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై వీటిని విక్రయిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇంటర్నెట్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌లో ప్రసారమైన నిత్యానంద- రంజిత క్లిప్పింగ్‌లనే సీడీలుగా మార్చి విక్రయించే వారి సంఖ్య ఎక్కువైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X