హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వంపై నాగార్జున మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagarjuna
హైదరాబాద్: సినిమాల పైరసీని అరికట్టలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రముఖ సినీ నటుడు నాగార్జున తీవ్రంగా మండిపడ్డారు. పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నిర్మాత యలమంచిలి రవిచంద్ ను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోంది గానీ పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. గత ఐదారేళ్లుగా సినీ పరిశ్రమ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉందని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోందని, అయితే చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రవిచంద్ ను మురళీ మోహన్, నిర్మాత సురేష్, దర్శకుడు నారాయణ మూర్తి తదితరులు కూడా బుధవారం పరామర్శించారు. పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మురళీ మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆయన అన్నారు. పైరసీ వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారని సురేష్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X