హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోలేదు: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇంత వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. ఏప్రిల్ 4వ తేదీన మంచి ముహూర్తం ఉంటే ఆ రోజు మంచి పనులు చేద్దామని ఆయన అన్నారు. ఏప్రిల్ 4వ తేదీన మంచి ముహూర్తం ఉన్నందున మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తా కథనాలపై ఆయన ఆ విధంగా అన్నారు. ఆయన బుధవారం శాసనసభ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై అందరూ కోరేదే చేస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రణాళికా సంఘం తప్పు పట్టిందనే వార్తల్లో నిజం లేదని, సంక్షేమ పథకాలను ప్రణాళికా సంఘం తప్పు పట్టలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అపాలని అడిగే అధికారం ప్రణాళికా సంఘానికి లేదని, అన్ని పథకాలు యధావిధిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ పథకాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని మాత్రమే ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X