విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లండన్‌లో కృష్ణా జిల్లా యువకుడి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Naresh
విజయవాడ: లండన్‌ లో రాష్ట్రానికి చెందిన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం మిట్టగూడేనికి చెందిన సామినేని రమేష్ (24) లండన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండున్నరేళ్ల క్రితం ఉన్నత విద్య అభ్యసించేందుకు అక్కడికి వెళ్లిన రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్నేహితులతో కలిసి అతను కెస్ట్ లో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం అతను సమీపంలోని రైల్వే స్టేషన్లో రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది.

తండ్రి రంగయ్య వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో నరేష్ పెద్దవాడు. రెండో కుమారుడు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నరేష్ మృత దేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడానికి సహాయపడాలని విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ లేఖ రాశారు. నరేష్ కు ఎటువంటి సమస్యలు లేవని, ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X