చీఫ్ జస్టిస్ కు బెదిరింపు కేసులో పురోగతి
ఇలా ఉండగా న్యాయవాదులపై దాడికేసులో ఎట్టకేలకు తెదేపా నేతలకు కొంత వూరట లభించింది. ఇటీవల ఇందిరాపార్క్ వద్ద న్యాయవాదులకు, తెదేపానేతలకు మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో పలువురు న్యాయవాదులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై అప్పట్లో తెదేపా నేతలపై పోలీసులు కేసునమోదు చేశారు. దీంతో తెదేపానేతలు కేసు విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టునాశ్రయించారు. పిటీషన్ను పరిశీలించిన న్యాయస్థానం కేసువిచారణను మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే మంజూరు చేసింది.
Comments
Story first published: Friday, March 19, 2010, 13:58 [IST]