హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీఫ్ జస్టిస్ కు బెదిరింపు కేసులో పురోగతి

By Santaram
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బెదిరింపు లేఖపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఎ.కె.ఖాన్‌ తెలిపారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ప్రధానన్యాయమూర్తికి బెదిరింపులేఖరాశారు. ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకూ ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

ఇలా ఉండగా న్యాయవాదులపై దాడికేసులో ఎట్టకేలకు తెదేపా నేతలకు కొంత వూరట లభించింది. ఇటీవల ఇందిరాపార్క్‌ వద్ద న్యాయవాదులకు, తెదేపానేతలకు మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో పలువురు న్యాయవాదులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై అప్పట్లో తెదేపా నేతలపై పోలీసులు కేసునమోదు చేశారు. దీంతో తెదేపానేతలు కేసు విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టునాశ్రయించారు. పిటీషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం కేసువిచారణను మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే మంజూరు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X