హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాంపు ఆఫీసు: రోశయ్య సాహసం

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య బేగంపేటలోని అధికార ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశానికి ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 8.46 గంటలకు సీఓం క్యాంపు కార్యాలయంలోకి మారనున్నారు. ఉదయం, సాయంత్రం గంట నుంచి రెండు గంటలపాటు సందర్శకులకు కేటాయించేందుకు నిర్ణయించుకున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన రోశయ్య ఇప్పటివరకూ క్యాంప్‌ కార్యాలయంలోకి అధికారికంగా అడుగుపెట్టలేదు. పది కోట్ల రూపాయలతో వైయస్ హయాంలో ఈ క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. అయితే కొన్ని వాస్తు దోషాలు ఉండడం వల్లనే వైయస్ ఆకస్మికంగా మరణించారని కొందరు పండితులు చెప్పడంతో రోశయ్య ఇక్కడికి రావడానికి కొన్ని నెలలపాటు తటపటాయించారు. ఈ భవనాలకు ఇటీవల స్వల్పంగా వాస్తు మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X