హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'చిరుపై పడే హక్కు విజయశాంతికి లేదు'

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్‌: టీఆర్ ‌ఎస్‌ ఎంపీ విజయశాంతికి చిరంజీవి గురించి మాట్లాడే హక్కు లేదని పీఆర్పీ నేత బూర్లగడ్డ వేదవ్యాస్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు.

విజయశాంతికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని వేదవ్యాస్‌ మండిపడ్డారు. ఆమె మూలాలు ఎక్కడో తెలుసునని, విజయశాంతి దుకాణం ఎప్పుడో ముగిసిపోయిందన్నారు. కేవలం తన ఉనికి కోసమే చిరంజీవిపై వ్యాఖ్యలు చేస్తున్నదని వేదవ్యాస్‌ అన్నారు. విజయశాంతి తాతలు ఆంధ్రప్రాంతానికి చెందిన వారన్న వార్తలు ఆ మధ్య వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X