వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ మాజీ ప్రధాని కొయిరాలా మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Girija Prasad Koirala
ఖాట్మండు: నేపాల్‌ మాజీ ప్రధాని గిరిజా ప్రసాద్‌ కొయిరాలా కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. డయేరియాతో ఆయన ఇటీవలే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం డిశ్ఛార్జి అయ్యారు. విదేశాంగమంత్రిగా ఉన్న ఆయన కూతురు ఇంట్లోనే ప్రస్తుతం ఆయన ఉన్నారు.

నిన్నటినుంచి డయేరియాతో బాధ పడుతుండటంతో ఆయనకు ఇంట్లోనే వెంటిలేటర్లు అమర్చి చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ప్రసుత్తం నేపాల్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఖాట్మండునుంచి బయటకు వెళ్లిన పార్టీ సీనియర్‌ నేతలందరినీ ఈరోజు అత్యవసర సమావేశానికి రావాలని పార్టీ ఆదేశాలు జారీచేయటంతో కొయిరాలా పరస్థితి విషమమని తెలిసిపోయింది. 87 సంవత్సరాల కొయిరాలా నేపాల్‌లో 240 ఏళ్ల రాజరికాన్ని అంతమొందించి ప్రజాస్వామ్య దేశంగా అవతరించటంలో ప్రధానపాత్ర పోషించారు. నాలుగుసార్లు నేపాల్‌ ప్రధానిగా పనిచేశారు. 2007 జనవరినుంచి 2008 జులై వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మృతికి అన్ని రాజకీయపార్టీల ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X