నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాతీయ లా కమిషన్ చైర్మన్ గా పివి రెడ్డి

By Santaram
|
Google Oneindia TeluguNews

PV Reddy
న్యూఢిల్లీ: జాతీయ లా కమిషన్‌ 19వ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పొనక వెంకటరామారెడ్డి(పి.వి.రెడ్డి) నియమితులయ్యారు. ఈమేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2012 ఆగస్టు వరకు జస్టిస్‌ పీవీ రెడ్డి ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్‌ పీవీ రెడ్డి 1940 ఆగస్టు 10న నెల్లూరు జిల్లా ఆల్లూరులో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1962లో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా సభ్యత్వాన్ని తీసుకున్నారు.

మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ పి.రామచంద్రారెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా వరకు ఎదిగారు. 2001 ఆగస్టు 17 నుంచి 2005 ఆగస్టు 10 వరకు జస్టిస్‌ పీవీ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. గత మూడేళ్ల నుంచి న్యూఢిల్లీలో అడ్వాన్స్‌ రూలింగ్‌ అథారిటీ(ఇన్‌కంట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్‌) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఆయన ఈ బాధ్యతల నుంచి వైదొలగే అవకాశం ఉంది. గురువారం లా కమిషన్‌ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X