మావోల బంద్, పోలీసులు అప్రమత్తం
మావోయిస్టు పార్టీ అగ్రనేతల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆ పార్టీ యాక్షన్ టీంలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికల మేరకు పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిసింది. ఉద్యమ ప్రస్థానంలో సుధీర్ఘకాలం పనిచేసిన శాఖమూరి అప్పారావు, టెక్ రమణల ఎన్ కౌంటర్ కు నిరసనగా ఆ పార్టీ సోమ, మంగళవారం బంద్కు పిలుపునిచ్చింది. అంతేగాకుండా అగ్రనేతల ఎన్ కౌంటర్కు ప్రతీకారం తీర్చుకుంటామని పార్టీ ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి దామోదర్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల సరిహద్దులోని ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల్లో పోలీసులు రెండు రోజులుగా అడవులను జల్లెడ పడుతున్నట్లు సమాచారం.
Comments
మావోయిస్టులు వరంగల్ పోలీసులు అప్రమత్తం శాఖమూరి అప్పారావు బంద్ maoists warangal police alert sakhamuri apparao bandh
Story first published: Monday, March 22, 2010, 8:43 [IST]