వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోల బంద్, పోలీసులు అప్రమత్తం

By Santaram
|
Google Oneindia TeluguNews

Maoists
వరంగల్‌: సీపీఐ(మావోయిస్టు) పార్టీ సోమవారం నుంచి రెండు రోజుల బంద్‌ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీ సులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టిసారించిన అధికారులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ప్రత్యేక బలగాలను అడవులకు తరలించారు. బంద్‌ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు ముమ్మరం చేశారు.

మావోయిస్టు పార్టీ అగ్రనేతల ఎన్‌ కౌంటర్‌ నేపథ్యంలో ఆ పార్టీ యాక్షన్‌ టీంలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్‌ హెచ్చరికల మేరకు పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిసింది. ఉద్యమ ప్రస్థానంలో సుధీర్ఘకాలం పనిచేసిన శాఖమూరి అప్పారావు, టెక్‌ రమణల ఎన్‌ కౌంటర్‌ కు నిరసనగా ఆ పార్టీ సోమ, మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అంతేగాకుండా అగ్రనేతల ఎన్‌ కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని పార్టీ ఏటూరునాగారం, మహదేవపూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి దామోదర్‌ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల సరిహద్దులోని ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల్లో పోలీసులు రెండు రోజులుగా అడవులను జల్లెడ పడుతున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X