హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాంపు కార్యాలయంలోకి సిఎం ప్రవేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: హైదరాబాద్ లోని బేగంపేటలో గల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి కె. రోశయ్య సోమవారం శుభ ముహూర్తాన అడుగు పెట్టారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన ఏడు నెలల తర్వాత ఆయన క్యాంపు కార్యాలయంలోకి మారారు. ఆయన సోమవారం ఉదయం పదిన్నర గంటలకు క్యాంపు ఆఫీసులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కార్యక్రమాలను ఆయన ఇక నుంచి ఇక్కడి నుంచే నిర్వహిస్తారు.

రోశయ్య క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన సందర్భంలో ఆయన వెంట కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి రామచందర్ రావు, మంత్రులు గల్లా అరుణ తదితురులు ఉన్నారు. రోశయ్య కోసం క్యాంపు కార్యాలయంలో స్వల్ప మార్పులు జరిగాయి. పై అంతస్థులకు వెళ్లడానికి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తూర్పు దిక్కు ముఖం చేసి కూర్చునేవారు. అయితే రోశయ్య దక్షిణం వైపు ముఖం చేసి కూర్చునేలా ఏర్పాటు చేశారు. వాస్తును తెలిపే టాంగ్ చేపల ఆక్వేరియాన్ని ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X