వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో హైదరాబాద్ యువకుడి హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Prashanth
హైదరాబాద్: హైదరాబాద్‌ కి చెందిన ప్రశాంత్ గోయినాక అనే యువకుడిని అమెరికాలోని ఓక్లహామా నగరంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. హతుడు ప్రశాంత్ హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందినవాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని సెయింట్ థామస్‌ లో బీకాం చదివిన అనంతరం ఉన్నత చదువుల కోసం రెండు నెలల క్రితం అమెరికా వెళ్లాడు. కాలిఫోర్నియాలోని ఐటియులో ఎంబిఎ విద్యనభ్యసించడానికి అతడికి సీటు వచ్చింది.

అయితే ఓక్లహామా నగరంలోని ఒక గ్రాసరీ స్టోర్‌లో ఉద్యోగం ఉన్నట్టు తెలుసుకొని మూడు రోజుల క్రితం ప్రశాంత్ ఓక్లహామాకి వెళ్లాడు. ఈ గ్రాసరీ స్టోర్‌లో శనివారమే అతినికి ఉద్యోగం లభించింది. ఉద్యోగంలో చేరిన మరునాడే ఈ దుర్ఘటన జరిగింది. గ్రాసరీ స్టోర్‌లో ఆ సమయాన ప్రశాంత్ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తున్నది. స్టోర్‌కి సంబంధించిన వ్యక్తులు బయటకు వెళ్లడంతో ప్రశాంత్ క్యాష్ కౌంటర్ చూస్తున్నాడు. ఆ సమయంలో కొందరు నల్లజాతి యువకులు వచ్చి కౌంటర్‌లో ఉన్న డబ్బు దోచుకుపోవడం కోసమే ప్రశాంత్‌పై కాల్పులు జరిపినట్టు ఓక్లహామా సిటీ పోలీసు వర్గాలను బట్టి తెలుస్తున్నది. ఆఫీసర్ లాసన్ (డిటెక్టివ్) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన జరిగిన వెంటనే ప్రశాంత్ సహచరులకు విషయం తెలిసి హైదరాబాద్‌లోని ప్రశాంత్ తల్లిదండ్రులకు జరిగిన విషయం గురించి తెలియజేశారు. ప్రశాంత్ తండ్రి రాజయ్య గోయినాక హైదరాబాద్‌లో వైద్యశాఖ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. తండ్రి రాజయ్య కోరిక మేరకు ప్రశాంత్ మృతదేహాన్ని ఓక్లహామా నుంచి హైదరాబాద్‌కు తరలించడానికి యత్నాలు జరుగుతున్నట్లు తానా నాయకుడు ప్రసాద్ తోటకూర తెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X