వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శాఖమూరి డైరీ మా వద్దలేదు: ఎస్పీ
మావోయిస్టులు గత మూడునెలలుగా స్తబ్దుగా ఉండడంపై తాము కూడా కొన్ని వూహాత్మక ప్రణాళి కలు సిద్ధం చేసుకు న్నామన్నారు. బలి మెల, కలిమెల తదితర ముఖ్య కూడళ్లలో నిఘాను మరింత పెంచేందుకు ఒరిస్సా రాష్ట్ర పోలీస్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు జరిపేందుకు సన్నహాలు పూర్తయ్యాయన్నారు.
ఏఓబీలో మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ ముఖ్య సభ్యులెవరూ లేరని ఎస్పీ చెప్పారు. ఆపరేషన్ గ్రీన్హంట్ను దృష్టిలో పెట్టుకుని నాయకులంతా ఏజె న్సీలో ఆశ్రయం పొందుతున్నారన్న వదంతులను నమ్మవద్దన్నారు. గిరిజన యువతులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వచ్చిన వార్తలకు స్పందించి ప్రత్యేకంగా ఉమెన్ ట్రాఫికింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. అమాయకులైన గిరిజన యువతను మావోయిస్టులు తప్పుదారి పట్టిస్తున్నారని, మిలీషియా సభ్యులకు తాము కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు.
Story first published: Wednesday, March 24, 2010, 10:37 [IST]