శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ కౌంటర్: ముగ్గురు పోలీసుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
శ్రీకాకుళం: ఆంధ్ర - ఒడిషా సరిహద్దులోని పాతపట్నం వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మృతులను దీపక్ సేన్, బలగామ్ ప్రధాన్, సంజయ్ లుగా గుర్తించారు.

మృతుల్లో సంజయ్ దర్కి ఒడిషాలోని సుందర్ గడ్ కు చెందినవాడు. మిగతా ఇద్దరు బార్సిగుడాకు చెందినవారు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఉపేంద్ర నాయక్, రాజేష్ ముండా, కృపా సింగ్ ప్రధాన్ లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దులోని మోహనా వద్ద మావోయిస్టులు మూడు సెల్ టవర్లను పేల్చేశారు. ఈ స్థితిలో ఎఒబిలో రెడ్ అలర్డ్ ప్రకటించారు. మావోయిస్టులు 46 గంటల బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X