హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశాంత్ మృతదేహం కోసం నిరీక్షణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Prashanth
హైదరాబాద్‌: యుఎస్‌ లోని ఓక్లహామాలో ఒక ఆహారదుకాణంలో పనిచేస్తూ ఎంబిఏ చదువుకుంటున్న హైదరాబాదీ యువకుడు జి.ప్రశాంత్‌(28) గుర్తు తెలియని హంతకుల చేతిలో కాల్పులకు గురై మరణించటంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. కుమారుడిని కడసారి చూసుకోవాలని కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు.

తమ పిల్లవాడి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరలో నగరానికి పంపవలసిందిగా ప్రశాంత్‌ కుటుంబీకులు కోరుతున్నారు. ప్రశాంత్‌ తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు అతడి మరణ వార్త విన్నాక దిగ్భ్రాంతికి లోనయ్యారు. సాధ్యమైనంత త్వరలో మృతదేహాన్ని ఇక్కడకు పంపాల్సిందిగా యుఎస్‌, భారత్‌ అధికారులను వారు అభ్యర్ధిస్తున్నారు. త్వరగా మృతదేహం పంపేలా అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావలసిందిగా ప్రశాంత్ తండ్రి కేంద్రప్రభుత్వానికి ఫ్యాక్స్ పంపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X