వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్యాణ వేదికకు చేరుకున్న శ్రీరాముడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhadrachalam
భద్రాచలం: శ్రీరాముడు బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా కళ్యాణ వేదికకు చేరుకున్నాడు. వధూ వరులుగా అలంకరించిన సీతారాముల ఉత్సవ విగ్రహాలను పూలపల్లకిలో మిథిల స్టేడియానికి ఆలయ అధికారులు తీసుకువచ్చారు. శ్రీరాముడి కళ్యాణం కోసం పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అదికేశవులు నాయుడు మంగళవారమే భద్రాద్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య వాటిని భద్రాద్రి రాముడికి సమర్పించేందుకు హైదరాబాదు నుంచి ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి బయలు దేరారు.

శ్రీరాముడి కళ్యాణ వేడుకను కనులారా చూసేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం భద్రాద్రిలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. శ్రీరాముడి కళ్యాణం కోసం భద్రాద్రి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X