హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: ముస్లిం కోటాపై ఆక్బరుద్దీన్ పట్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లపై చర్చకు మజ్లీస్ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గురువారం శాసనసభలో పట్టు పట్టారు. దీంతో 20 నిమిషాలకుపైగా శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. చైర్ లో కూర్చున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. సభను డిప్యూటీ స్పీకర్ అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని అక్బరుద్దీన్ సహా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. డిప్యూటీ స్పీకర్ తీరు సభ్యులను అవమాన పరిచేదిగా ఉందని అక్బరుద్దీన్ అన్నారు.ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చర్చకు అవకాశం ఇస్తానని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే చెప్పినా ఆయన వినలేదు.

స్పీకర్ ఛేంబర్ ఖరారైన ఎజెండా ప్రకారం సభను నడుపుకుందామని ముఖ్యమంత్రి కె రోశయ్య చెప్పారు. సమయాన్ని వృధా చేస్తూ సమయం లభించడం లేదని వాదించడం సరి కాదని ఆయన అన్నారు. చైర్ లో ఎవరు ఉన్నా వారిని గౌరవించడం అవసరమని ఆయన ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. బిఎసిలో నిర్ణయించిన ఎజెండా ప్రకారం సభను నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఏడు అంశాలపై చర్చను ఎప్పుడు చేపడుతారో చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అడిగారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే నచ్చజెప్పడంతో అక్బరుద్దీన్ తన పట్టు వీడారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X