వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యశ్రీపై శాసనసభలో దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: ఆరోగ్యశ్రీపై గురువారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. మంత్రి దానం నాగేందర్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు నిరనస వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులను నీరు గార్చి కార్పోరేట్ ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చడమే ఆరోగ్యశ్రీ అని ఆయన విమర్శించారు. ప్రభుత్వాస్పత్రులను నీరు గారుస్తూ కార్పోరేట్ ఆస్పత్రులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆయన అన్నారు. పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాస్పత్రులు దీవాళా తీస్తున్నాయని, ప్రభుత్వం కార్పోరేట్ ఆస్పత్రుల కొమ్ము కాయడం వల్లనే ఆ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు విమర్శను ముఖ్యమంత్రి రోశయ్య ఖండించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వాస్పత్రులు సక్రమంగా ఉంటే ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకు పోతారని ఆయన అడిగారు. ప్రభుత్వాస్పత్రులను మెరుగు పరచడానికి తాము శతవిధాలా ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సమాధానంతో చంద్రబాబు సంతృప్తి చెందలేదు. తమకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని ఆయన చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని మంత్రులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యను తప్పు పట్టారు. అందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన పట్టు బట్టారు. చంద్రబాబు వ్యాఖ్యను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X