వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి: దామోదర్‌ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
సూర్యాపేట: రాజీనామా చేసిన వారే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సూర్యాపేట కాంగ్రెసు శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి సూచించారు. తెలంగాణ కోసం తమ పదవులను త్యాగం చేసిన వారిపై ఇతర పార్టీలు పోటీకి దిగడం సరికాదన్నారు. తెలంగాణ వాదాన్ని విన్పించేందుకే తాను పదవికి రాజీనామా చేయలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ ప్రాంతం వారిని ద్రోహులుగా చిత్రీకరించడం మానుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై శ్రీకష్ణ కమిటీకి వివరంగా లేఖ రాస్తానని తెలిపారు. అందరం ఐక్యంగా ఉండి శ్రీకష్ణ కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు తెలంగాణ కోసం ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X