హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి వైయస్ జగన్ తో రామోజీ ఢీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మరోసారి ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావుకు, సాక్షి దినపత్రిక అధిపతి, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మధ్య మీడియాలో వార్ ప్రారంభమైంది. కర్నూలు జిల్లా అవుకులో రైతుల భూముల లీజు వ్యవహారంపై ఈనాడులో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ కొద్ది రోజుల క్రితం వార్తాకథనం ప్రారంభమైంది. రైతుల స్పందనలు, రుణాల లభ్యత, భూముల రిజిస్ట్రేషన్, క్రయవిక్రయాల వంటి విషయాలపై జగన్, వైయస్ రాజశేఖర రెడ్డి బావ మరిది వాటాదారులుగా ఉన్న విజయలక్ష్మీ ఇండస్టీస్ పై ఆరోపణలు చేస్తూ ఈనాడు వార్తాకథనం ప్రారంభించింది. రామోజీకి మద్దతుగా తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం ముందుకు వచ్చాయి. ఆ వార్తాకథనాన్ని ఖండిస్తూ సాక్షిలో గురువారం రామోజీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వార్తాకథనం ప్రచురించితమైంది. విజయలక్ష్మీ ఇండస్ట్రీస్ నుంచి జగన్ 2000 మార్చిలో, రవీంద్రనాథ్ రెండ్డి 2003లో తప్పుకున్నట్లు స్పష్టం చేసింది.

విజయలక్ష్మీ ఇండస్ట్రీస్ కర్నూలు జిల్లా అవుకులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధికారుంలో ఉన్నప్పుడే భూములను లీజుకు పొందిందని సాక్షి తెలిపింది. ఆ సంస్థ చేసుకున్న దరఖాస్తు మేరకు 2004లో గనుల లీజుకు ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే వైయస్ మరణించే వరకు కూడా ఆ భూముల ద్వారా ఆ సంస్థ ఒక్క పైసా ఆదాయం పొందలేదని స్పష్టం చేసింది. ఫొటోలు వేరే విషయం, వేరే వారి అభిప్రాయాలను ఈనాడు వార్తాకథనంలో రాశారని సాక్షి ఆరోపించింది. ఈనాడు వార్తాకథనంలోని లోపాలను సాక్షి వార్తాకథనం ఎత్తి చూపే ప్రయత్నం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X