వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెనాలి ఆర్కెస్క్రాను అడ్డుకున్న తెలంగాణ వాదులు
ఈ సందర్భంగా మహబూబాబాద్ జేఏసీ నాయకులు డోలి సత్యనారాయణ, పర్కాల రవీందర్, పొక్కుల సదానందం, తేళ్ల శ్రీనివాస్, ఫరీద్, ఫయీజ్, ప్రభాకర్, అశోక్ తదితరులు ఊరేగింపును అడ్డుకొని, నాలుగు బ్యానర్లను చించివేశారు. మరో బ్యానర్ను దహనం చేశారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతూ 350 మందికి పైగా విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తుంటే...మరోవైపు తెనాలి నుంచి ఆర్కెస్ట్రా బృందాలను తీసుకొచ్చి, తెలంగాణ పేద కళాకారుల పొట్టలు కొడతారా? అంటూ శ్రీరామమందిరం చైర్మన్ గద్దె రవిని నిలదీశారు. దీంతో చైర్మన్ రవి ఇరువర్గాల వారికి సర్దిచెప్పి, ఊరేగింపును నిలిపివేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము స్థానిక తెలంగాణ ఆర్కె స్ట్రా కళాకారులను విస్మరించలేదని, వారికి అన్యాయం జరగనివ్వబోమని పేర్కొన్నారు.
Story first published: Thursday, March 25, 2010, 8:57 [IST]