వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెనాలి ఆర్కెస్క్రాను అడ్డుకున్న తెలంగాణ వాదులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
మహబూబాబాద్‌: సీతారాముల కల్యాణం అనంతరం ఊరేగింపు సందర్భంగా ఆర్కెస్ట్రా కార్యక్రమం నిర్వహిస్తున్న తెనాలి బృందాన్ని జేఏసీ నాయకులు అడ్డుకున్న సంఘటన బుధవారం రాత్రి మహబూబాబాద్‌లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక శ్రీరామ మందిరం ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం రాత్రి జరిగే ఊరేగింపు కార్యక్రమం శ్రీబాజి ఆర్కెస్ట్రా తెనాలి వారి ఆధ్వర్యంలో సాగుతూ రైల్వేస్టేషన్‌ సెంటర్‌కు చేరుకుంది.

ఈ సందర్భంగా మహబూబాబాద్‌ జేఏసీ నాయకులు డోలి సత్యనారాయణ, పర్కాల రవీందర్‌, పొక్కుల సదానందం, తేళ్ల శ్రీనివాస్‌, ఫరీద్‌, ఫయీజ్‌, ప్రభాకర్‌, అశోక్‌ తదితరులు ఊరేగింపును అడ్డుకొని, నాలుగు బ్యానర్లను చించివేశారు. మరో బ్యానర్‌ను దహనం చేశారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతూ 350 మందికి పైగా విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తుంటే...మరోవైపు తెనాలి నుంచి ఆర్కెస్ట్రా బృందాలను తీసుకొచ్చి, తెలంగాణ పేద కళాకారుల పొట్టలు కొడతారా? అంటూ శ్రీరామమందిరం చైర్మన్‌ గద్దె రవిని నిలదీశారు. దీంతో చైర్మన్‌ రవి ఇరువర్గాల వారికి సర్దిచెప్పి, ఊరేగింపును నిలిపివేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము స్థానిక తెలంగాణ ఆర్కె స్ట్రా కళాకారులను విస్మరించలేదని, వారికి అన్యాయం జరగనివ్వబోమని పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X