కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానంది ఆలయంలో దొంగతనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool
కర్నూలు: కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత గురువారం తెల్లవారు జామును మూడు గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆలయంలోని రెండు హుండీలను పగులగొట్టి ఆగంతకులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి హుండీతో పాటు ఆంజనేయస్వామి హుండీని పగులగొట్టారు. వీటిని తెరిస్తే తప్ప ఏ మేరకు చోరీ జరిగిందనేది గుర్తించడం సాధ్యం కాదు.

గురువారం ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకులు చోరీ విషయాన్ని గుర్తించి ఆలయాధికారులకు తెలిపారు. వెంటనే ఆలయాధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబందించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి నేర చరిత్ర ఉన్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X