వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిట్ వివాదం: ఢిల్లీ చేరిన విద్యార్ధులు, వైవి రావు

By Santaram
|
Google Oneindia TeluguNews

YV Rao
వరంగల్: నిట్ డైరెక్టర్ వైవి రావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాను రాజీనామా చేయలేదని, విద్యార్ధుల బలవంతంపై వారు రాసిచ్చిన కాగితంపై సంతకం చేశానని చెబుతున్న ఆయన కాజీపేట పోలీసు స్టేషన్ లో విద్యార్ధులపై ఫిర్యాదు చేయడం గమనించవలసిన విషయం.

నిట్‌ విద్యార్థులు గురువారం ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం జరగనున్న నిట్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో వై.వి.రావుపై ఫిర్యాదు చేయనున్నారు. పనిలోపనిగా కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు విద్యార్థులు తెలిపారు. అవసరమైతే ఢిల్లీ విజ్ఞాన భవన్‌ ఎదుట ఆందోళన చేపట్టేందుకు వెనుకాడబోమని పేర్కొన్నారు.

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు వై.వి రావు ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఒక నివేదికను సమర్పించనున్నట్లు సమాచారం. తన పలుకుబడితో బయటపడేందుకు యత్నిం లో భాగంగానే ఆయన ఢిల్లీ సమావేశానికి హాజరవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అవసరమైతే బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం జరగకుండా వాయిదా వేయించాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X