పోలీసు స్టేషన్ లో కాళేశ్వర్ బాబా విచారణ
పాత్రికేయులు తనకు సోదరులతో సమానమని సాయి కాళేశ్వర్ బాబా పేర్కొన్నారు. ఎస్ఐ విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు, పాత్రికేయులకు మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలున్నాయని, కొందరు వ్యక్తులు పథకం ప్రకారం తమ మధ్య శతృత్వం పెంచడానికి కుట్ర పన్నారన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో పాత్రికేయుల స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, తాను ఇలాంటి ఆరోపణలతో కూడిన వార్తలను గతంలోనే చవిచూశానన్నారు. ఒక వేళ తాను కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చన్నారు.
Comments
అనంతపురం పెనుగొండ విలేకరులు బెదిరింపులు విచారణ కాళేశ్వర్ బాబా penugonda reporters threats anantapur kaleshwar baba
Story first published: Friday, March 26, 2010, 9:42 [IST]