అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు స్టేషన్ లో కాళేశ్వర్ బాబా విచారణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Kaleshwar Baba
పెనుకొండ: పెనుకొండ షిరిడి సాయి గ్లోబల్‌ ట్ర స్టు అధినేత సాయికాశేశ్వర్‌ బాబాను, ట్రస్టు సభ్యులను ఎస్‌ ఐ మురళీ కృష్ణ గురువారం సాయంత్రం విచారించారు. తమను బెదిరించారని పాత్రికేయులు కాళేశ్వర్‌తోపాటు ఆయన ట్రస్టు సభ్యులపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు ఎస్‌ఐ గురువారం సాయంత్రం కాళేశ్వర్‌తోపాటు ట్రస్టు సభ్యులను స్టేషన్‌కు పిలిపించి విచారించగా ఇందులో తమ పాత్ర లేదని వారు వివరణ ఇచ్చారు. తమను ఇబ్బందులు పాలు చేసేందుకే కొందరు వ్యక్తులు ఇలా చేసివుండవచ్చని అనుమానిత పేర్లను కాళేశ్వర్‌ పోలీసులకు వివరించారు.

పాత్రికేయులు తనకు సోదరులతో సమానమని సాయి కాళేశ్వర్‌ బాబా పేర్కొన్నారు. ఎస్‌ఐ విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు, పాత్రికేయులకు మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలున్నాయని, కొందరు వ్యక్తులు పథకం ప్రకారం తమ మధ్య శతృత్వం పెంచడానికి కుట్ర పన్నారన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో పాత్రికేయుల స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, తాను ఇలాంటి ఆరోపణలతో కూడిన వార్తలను గతంలోనే చవిచూశానన్నారు. ఒక వేళ తాను కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X