హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాంతిభద్రతలకు అన్ని చర్యలు: సబిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ 35 వేల పోలీసు సిబ్బందిని మూడు దశల్లో నియమిస్తామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రజలు అశాంతితో సతమతమవుతున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం, బిజెపి, మజ్లీస్, సిపిఐలు విమర్శించాయి.

శాంతిభద్రతలు, రక్షణ సలహా కమిటీని రద్దు చేయాలని తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా ఉన్నాయని, హైదరాబాద్ లో నేరాల సంఖ్య పెరుగుతోందని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. నగరంలోని నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. నేరాల్లో దేశంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని, ఇది ఆందోళన చెందాల్సిన విషయమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X