శాంతిభద్రతలకు అన్ని చర్యలు: సబిత
శాంతిభద్రతలు, రక్షణ సలహా కమిటీని రద్దు చేయాలని తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా ఉన్నాయని, హైదరాబాద్ లో నేరాల సంఖ్య పెరుగుతోందని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. నగరంలోని నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. నేరాల్లో దేశంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని, ఇది ఆందోళన చెందాల్సిన విషయమని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, March 26, 2010, 11:23 [IST]