వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమితాబ్ కు దూరం: కాంగ్రెసు ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Amitabh Bachchan
న్యూఢిల్లీ: మరో సీలింక్ వివాదాన్ని నివారించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిర్ణయించుకున్నారు. ఆదివారం పూణేలో జరిగే మరాఠీ సాహిత్య సమావేశంలో అమితాబ్ బచ్చన్ తో వేదికను పంచుకోకూడదని అశోక్ చవాన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. సీలింక్ ప్రారంభ కార్యక్రమంలో అమితాబ్ సరసన ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉండడంపై కాంగ్రెసు వర్గాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. అమితాబ్ ను ఈ కార్యక్రమానికి ఎన్సీపికి చెందిన మంత్రి ఆహ్వానించడంపై కాంగ్రెసు తీవ్ర ఆగ్రహంతో ఉంది.

కాంగ్రెసు తీరును ఎన్సీపి నాయకులు తేలిగ్గా కొట్టేయగా, అమితాబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తికి గురయ్యారు. ఈ స్థితిలో అమితాబ్ కు దూరంగా ఉండాలని కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి చవాన్ ను ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ కు అమితాబ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీంతో అమితాబ్ కు దూరంగా ఉండాలనేది కాంగ్రెసు వర్గాల అభిప్రాయం. అమితాబ్ స్వేచ్ఛను అరికట్టడం తమ ఉద్దేశం కాదని, గుజరాత్ అల్లర్లకు కారణమైన మోడీతో కలిసి పనిచేస్తున్న వ్యక్తిని తమ అధికార కార్యక్రమాలకు అహ్వానించాలా, వద్దా అనేది తమకు సంబంధించిన వ్యవహారమని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X