వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిట్ ముందు నరేంద్ర మోడీ హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
గాంధీనగర్: గుజరాత్ అల్లర్ల కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు శనివారం హాజరయ్యారు. ఈ కేసులో తొలిసారి నరేంద్ర మోడీని సిట్ ప్రశ్నించింది. శనివారం మధ్యాహ్నం పాత రాష్ట్ర సచివాలయం భవనంలో ఉన్న సిట్ కార్యాలయానికి ఆయన వెళ్లారు. అల్లర్ల కేసులో ఆయన సిట్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మోడీ వచ్చే ముందు బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని ముందస్తు తనిఖీలు నిర్వహించింది. గుజరాత్ అల్లర్ల సందర్బంగా అల్లరి మూకల దాడిలో మరణించిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ భార్య ఫిర్యాదు మేరకు మోడీకి సిట్ సమన్లు జారీ చేసింది. ఒక ముఖ్యమంత్రి విచారణను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. సిట్ చీఫ్ రాఘవన్ ఈ విచారణకు హాజరు కాలేదు. సిట్ ముందుకు మోడీ వస్తారా, లేదా అనే సంశయం దీంతో తీరిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X