హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారులపై తుపాకి గురి పెట్టం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: అధికారుల అవినీతిపై పత్రికల్లో వచ్చిందని వదిలేయమని, అలాగని ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులపై తుపాకీ గురిపెట్టబోమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకటరామిరెడ్డి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబడుతున్న సందర్భంలో శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి ఆ విధంగా అన్నారు. తొలుత 15 నిమిషాలు వాయిదా పడిన తర్వాత సభ తిరిగి సమావేశమైంది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడలేదు. ఎపిపిఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. ఎపిపిఎస్సీ అక్రమాలను సభ గానీ ముఖ్యమంత్రి గానీ తేలిగ్గా తీసుకోవద్దని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాచార హక్కు చట్టం కింద పొందిన వివరాలను తాము అందిస్తున్నామని, చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు.

ఎపిపిఎస్సీ అక్రమాలపై చర్చ సాధ్యం కాదని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరో రూపంలో వస్తే ఎపిపిఎస్సీ అక్రమాలపై చర్చకు అనుమతిస్తామని చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినిపించుకోలేదు. చేసిన ఆరోపణలను రుజువు చేయలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. ఆ అంశాన్ని ఇంతటితో వదిలేద్దామని, ఆరోపణల్లో వాస్తవాలుంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడకుండా చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభ రెండో సారి 15 నిమిషాల పాటు వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X