వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వద్దన్నా మోడీ పక్కన కూర్చున్న చీఫ్ జస్టిస్

By Santaram
|
Google Oneindia TeluguNews

Naredra Modi
గాంధీనగర్‌: అల్లర్ల కేసులో సిట్‌ నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్న గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌లు ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారమిక్కడ జరిగిన న్యాయ సదస్సులో బాలకృష్ణన్‌, నరేంద్రమోడీలు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొని, వేదికమీద మోడీ పక్కన కూర్చొవద్దని గుజరాత్‌ అల్లర్ల బాధితుల సంఘం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించినా ఆయన పట్టించుకోలేదు.

గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బందం(సిట్‌) నరేంద్రమోడీని సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన అనంతరం తనతో పని అయిపోయిందని సిట్‌ తనకు తెలిపిందని మోడీ మీడియాకు చెప్పారు. సిట్‌ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధాన మిచ్చానని, ఎనిమిదేళ్ల కింద జరిగిన గుజరాత్‌ అల్లర్ల సంబంధించిన అన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకొని మరీ సిట్‌కు తెలిపానని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X