హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనారిటీలకు సబ్ కోటా: టిడిపి

By Santaram
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన పోలిట్‌ బ్యూరో సమావేశంలో టీడీపి పలు తీర్మానాలు చేసింది. మహిళా రిజర్వేషన్‌లో బీసీలకు, మైనారిటీలకు సబ్‌కోటా ఉండాలని ఆపార్టీ తీర్మానించింది. జనాభా లెక్కల సేకరణలో ఓబీసీ కాలమ్‌ ఉండాలని కూడా టీడీపీ తీర్మానించింది. దీని కోసం సవరణలు చేసిన తర్వాతే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని ఆపార్టీ తీర్మానంలో తెలియజేసింది. సంస్థాగత ఎన్నికల కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని టీడీపీ ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఎంపీ రమేష్‌ రాధోడ్‌ను ఎన్నుకున్నారు.

రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటో తేదీన ప్రారంభమమ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు పొలిట్‌బ్యూరో సభ్యులను ఆదేశించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వాడవాడలా పసుపు పండగ ఘనంగా నిర్వహించాలని సూచించారు. శాసనసభ సమావేశాల కారణంగా రాజధానిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండిపోవడంతో మిగతా నాయకత్వం వ్యవస్థాపక దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చంద్రబాబు కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X