హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగుజాతి అత్మగౌరం కాపాడాం: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, పేద ప్రజల మేలు కోసం నిరంతరం పోరాడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి స్వర్గీయ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారని, తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చారని ఆయన అన్నారు. తమ పార్టీ పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజావ్యతిరేక పాలనను అందిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి, అక్రమాలపై తమ పార్టీ పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ పాటు పడుతోందని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేయడం, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడం తమ ఉద్దేశ్యాలని ఆయన చెప్పారు. తమ పార్టీ మాత్రమే పేద ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X