వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బళ్లారిలో తపాలా గణేష్ పై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Obulapram Mines
బళ్లారి: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైన్స్ కంపెనీ (ఒఎంసి)పై న్యాయపోరాటం చేస్తున్న తపాలా గణేష్ అనే వ్యక్తిపై దుండగులు సోమవారం బళ్లారిలో దాడి చేశారు. పది మంది దుండగులు ఆయనపై దాడి చేశారు. దాడిలో గాయపడిన తపాలా గణేష్ ను హైదరాబాద్ లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. ఒఎంసి గనుల తవ్వకంలో అక్రమాలకు పాల్పడుతోందంటూ తపాలా గణేష్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. బాలా రెసిడెన్సీ వద్ద టీ తాగుతుండగా తపాలా గణేష్ పై దాడి జరిగింది.

ఒఎంసి అవినీతిని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే తనను అడ్డు తొలగించుకోవడానికి ఆ సంస్థ యాజమాన్యమే తనపై దాడి చేయించిందని తపాలా గణేష్ ఆరోపించారు. అయితే తపాలా గణేష్ పై జరిగిన దాడితో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఒఎంసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. తపాలా గణేష్ పై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులు కూడా కొంత మంది గాయపడ్డారు. ఓబుళాపురం గనులకు సంబంధించి అధికారుల సర్వేపై విషయాలు తెలుసుకోవడానికి మీడియా ప్రతినిధులు తపాలా గణేష్ వద్దకు వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X