గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య బంధువునంటూ 50 లక్షలు వసూలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
గుంటూరు: ముఖ్యమంత్రి రోశయ్య బంధువునని చెప్పుకుని వ్యాపారుల నుంచి మామూళ్ళు వసూలు చేస్తున్న నేరెళ్ళ పాపారావు అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతనిపై చర్యలు తీసుకోడానికి వారం రోజులు తటపటాయించిన పోలీసులు మోసం (420) కేసు పెట్టారు.

వినుకొండకు చెందిన పప్పుల మిల్లు యజమాని నేరెళ్ళ పాపారావు అవినీతి పరులైన అధికారులకు, అక్రమాలు చేసే వ్యాపారులకు మధ్య వారధిగా ఉంటూ గత మూడు నెలలుగా పప్పుల, బియ్యం మిల్లుల యజమానుల నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పాపారావు చిన్న తమ్ముడు పూర్ణ చంద్రరావు నెల్లూరు జిల్లా గూడూరు మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న్నారు. రోశయ్య పెద్ద కుమారుడు శివప్రసాద్ కు బావమరిది అవుతాడు. ఈ దూరపు చుట్టరికాన్ని అడ్దంపెట్టుకుని పాపారావు వసూళ్ల కార్యక్రమాన్ని చేపట్టాడని పోలీసు అధికారులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X