హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశాంత్ అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు

By Santaram
|
Google Oneindia TeluguNews

Prashanth
హైదరాబాద్: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి ఈ నెల 21న నల్లజాతీయుల చేతిలో హత్యకు గురైన గోయినాక ప్రశాంత్‌ మృతదేహం సోమవారం ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి పవన్‌ పురి కాలనీలోని స్వగృహానికి తరలించారు. ఆయనను కడసారి చూసేందుకు నగరంలోని ప్రముఖులు, ప్రధాన పార్టీ నాయకులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పించారు.

అనంతరం ఇంటి నుంచి సైదాబాద్‌ దోబీఘాట్‌ హిందూ స్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపారు. నగర మేయర్‌ బండ కార్తీకరెడ్డి, ఎల్‌ బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ గ్రేటర్‌ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు లక్ష్మణ్‌, రాష్ట్ర సీపీఐ నాయకులు నారాయణ, డివిజన్‌ కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి, నాయకులు మిద్దెల జితేందర్‌, నల్ల రఘుమారెడ్డి, మెట్టు వెంకట్‌రెడ్డి, ఘనసాల పెంటయ్య, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌, ప్రశాంత్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X