మిర్యాలగూడలో కాలినడకన ఎస్పీ తనిఖీలు
గత రెండు రోజు లుగా హైదరాబాద్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్న దృష్ట్యా అనుమానితుల కోసం గాలింపు చర్యల్లో భాగంగా తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ రాజేశ్కుమార్ పట్టణానికి చేరుకున్న వెంటనే స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాంచంద్రారెడ్డితో సుమారు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. పలు రికార్డులను పరిశీలించినట్లు సమాచారం.
అనంతరం ఎన్ఎస్పీ అతి«థిగృహం పక్కన పట్టణ వన్ టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా సాగర్ రోడ్డుపై నడుచుకుంటూ పట్టణంలోని జనాభా, ట్రాఫిక్ పరిస్థితులపై డీఎస్పీ రామచంద్రారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సాగర్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ లోని కూరగాయల మార్కెట్కు వెళ్లి పరిశీలించారు. మార్కెట్లో పాదచారులు నడిచే స్థలంలో కూరగాయలను విక్రయించరాదని ఆదేశించారు. అదే విధంగా వన్టౌన్, టూటౌన్, సర్కిల్ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్స్టేష న్లను పాత మున్సిపాలిటీ కార్యాలయంలోకి మార్చనున్నందున ఆ భవనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా రాజీవ్చౌక్ వరకు నడుచుకుంటూ పట్టణంలో సంచరించారు. ఆయన వెంట డీఎస్పీ ఈ. రామచంద్రారెడ్డి, పట్టణ ఎస్ ఐ చంద్రకుమార్ తదితరులు ఉన్నారు.