హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ పర్యటన వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikrishna
న్యూఢిల్లీ: హైదరాబాద్ అల్లర్ల నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ సభ్యుల రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. కమిటీ సభ్యులు రవీందర్ కౌర్, అబూ సలే షరీఫ్ ఈ నెల 31వ తేదీ నుంచి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు తమ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు రవీందర్ కౌర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. చరిత్ర, ఆర్థిక, సాంస్కృతిక వ్యవహారాలపై రవీందర్ కౌర్, షరీఫ్ అధ్యయనం చేస్తున్నారు.

శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఎప్పుడు తిరిగి రాష్ట్రంలో పర్యటిస్తారనేది ఖరారు కాలేదు. ఏప్రిల్ 8వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నాలుగో సారి సమావేశం అయ్యేనాటికి వీరిద్దరి ఉత్తర తెలంగాణ పర్యటన పూర్తి కావాలని అనుకున్నారు. కానీ హైదరాబాద్ అల్లర్ల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X