వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప్పలపాడు బాధితులను ఆదుకుంటాం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
గుంటూరు: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో మరణించినవారి కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె. రోశయ్య హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఆయన గురువారం ఉదయం ఫోన్ చేసి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని ఆయన ఆదేశించారు.

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద గురువారం తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. మృతులంతా ప్రకాశం జిల్లా చిన్నదోర్నాలకు చెందిన వారని తెలుస్తున్నది. సిమెంట్ లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈస్టర్ పండుగ సందర్భంగా మాచర్ల నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X