కర్నూలు జిల్లాలో వెయ్యి గ్రామాలకు మినరల్ వాటర్
నాలుగు రోజుల్లో కోవెలకుంట్ల మండలంలోని రేవనూరు గ్రామంలో రెండు, నెల రోజుల్లో భీమునిపాడు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే కోవెలకుంట్ల పట్టణంలో మూడు చోట్ల ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కోకుటుంబానికి రోజుకు 20 లీటర్ల చొప్పున మినరల్వాటర్ను అందజేస్తామన్నారు. అయితే సభ్యత్వం కింద నెలకు ఒక్కోకుటుంబం రూ.10 చెల్లించాలన్నారు. కంపమల్ల గ్రామంలో బురదనీరు తాగాల్సి వస్తోందని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకురాగా వీలైనంత త్వరలో గ్రామంలో మినరల్వాటర్ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కేసీ కెనాల్కు నీటి విడుదల చేశారని, మరో 15రోజులపాటు కేసీలో నీరు ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల, భీమునిపాడు కాంగ్రెస్ నాయకులు పేరా రామసుబ్బారెడ్డి, ఆరికట్ల సుంకిరెడ్డి, అల్లూరు బాలిరెడ్డి, కోవెలకుంట్ల సీఐ మురళీనాయక్, తదితరులు పాల్గొన్నారు.